![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -252 లో.....కళ్యాణ్ బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం ధీరజ్ కి చెప్పలేక ప్రేమ బాధపడుతుంది. అప్పుడే ధీరజ్ వచ్చి.. అప్పుడు నాకేదో చెప్తానని వచ్చావేంటి.. ఆ విశ్వ గాడి గొడవలో చిరాకుగా అలా నీతో మాట్లాడేసాను.. దానికి సారీ.. ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలని వచ్చవని ధీరజ్ అడుగుతాడు. నాకు తెలుసు రా నేను బాధపడితే నువ్వు చూడలేవని ప్రేమ అనుకుంటుంది.
ఒకటి అడుగుతా చెప్పురా కళ్యాణ్ గాడు నన్ను మోసం చేసాడని జాలి తో పెళ్లి చేసుకున్నావ్ కదా.. నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు హ్యాపీగా లేవు కదా అని ధీరజ్ తో ప్రేమ అంటుంటే ధీరజ్ సైలెంట్ గా ఉంటాడు. మాట వరుసకి కూడా అలా కాదు అనట్లేదు.. అలాంటప్పుడు నా బాధని నీకు ఎలా చెప్పుకోవాలని ప్రేమ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ధీరజ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. మరొకవైపు నర్మద బాధపడుతుంటే సాగర్ వచ్చి.. ఏంటి నేను మాట మీద ఉండనని అనుకుంటున్నావా అని సాగర్ అంటాడు. నువ్వు తీసుకున్న నిర్ణయంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయని నర్మద అంటుంది.
నాకు నువ్వు ఇంపార్టెంట్.. నీ ప్రేమ కావాలని నర్మద అంటుంది. నువ్వు నాకోసం మీ వాళ్ళని వదులుకొని వచ్చావ్.. అలాంటి నీ కోసం ఏదైనా చేస్తానని నర్మదతో సాగర్ అంటాడు. మరొకవైపు కలశం నుండి చెయ్ రావడం లేదని రామరాజుతో తిరుపతి అంటాడు. అప్పుడే ఆనందరావు వస్తాడు. పక్క వీధిలోకి వచ్చాను. శ్రీవల్లి ని చూసి వెళదామని వచ్చానని ఆనందరావు అంటాడు. శ్రీవల్లి వాళ్ళ నాన్నని గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఎందుకు వచ్చావ్ నాన్న అని ఆనందరావుని శ్రీవల్లి కోప్పడుతుంది. ఇప్పుడు ఆ తిరుపతి చెయ్ కలషంలో నుండి బయటకి వస్తే అందులో ఉన్న గిల్టీ నగలని తెలుస్తాయి కదా అందుకే నేనొక ప్లాన్ తో వచ్చానని ఆనందరావు అంటుంటే.. మళ్ళీ ఏదో ప్రాబ్లమ్ తెస్తావ్ వద్దని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |